సిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పక్కింట్లో ఉండే శ్రీకాంత్ అనే వ్యక్తి, ఒంటరిగా ఉన్న రేఖ అనే వివాహితపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమెను కొడవలితో నరికి చంపి, తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. చెల్లి అని పిలుస్తూనే ఇంతటి ఘాతుకానికి పాల్పడటంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మరో ఘటనలో.. కరీంనగర్లోని జ్యోతినగర్లో అద్దెకు ఉంటున్న ఝాన్సీ అనే 23 ఏళ్ల నర్సు అనుమానాస్పదంగా మృతి చెందింది.