సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని మరోసారి స్పష్టం చేశారు. తన స్థానంలో భార్య నిర్మలను బరిలోకి దింపుతానని ప్రకటించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి వంటి నాయకులు చెప్పినా తాను ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని.. తన నిర్ణయానికే కట్టుబడి ఉంటానని ఆయన తేల్చిచెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించింది. గతంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించిన జగ్గారెడ్డి, ఇప్పుడు ముఖ్య నాయకుల పేర్లను చెప్పి తన రాజకీయ పట్టుదలను చాటుకున్నారు. నిర్మల జగ్గారెడ్డి ప్రస్తుతం టీజీఐఐసీ చైర్పర్సన్గా ఉన్నారు.