cm revanth reddy comments on pm modi : బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన బీసీ మహాధర్నాలో సీఎం మాట్లాడారు. ప్రధాని మోదీ గారు.. మీ గుజరాత్ రాష్ట్రం నుంచి తాను భూమి అడగడం లేదని.. మీ పోర్బందర్ పోర్టు నుంచి నీళ్లు అవసరం లేదని.. మా తెలంగాణలో బలహీన వర్గాలైన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చుకుంటామంటే మీ గుజరాతోలకు వచ్చిన కడుపు మంట ఏంటని ప్రశ్నించారు. ఈ బీసీ బిల్లును ఆమోదించకపోతే.. ప్రధాని మోదీని గద్దెదించుతామని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.