తెలంగాణలో భూ వివాదాలకు ముగింపు పలికేందుకు 'భూ భారతి' కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. సంగారెడ్డిలో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దుతూ, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగుతోందని మంత్రి పొంగులేటి తెలిపారు.