హైదరాబాద్కు చెందిన ఐదుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వినూత్న మోసానికి తెరలేపారు. యజమానులు అందుబాటులో లేని 'టు-లెట్' ఇళ్లను అద్దెకు తీసుకుని.. నకిలీ పత్రాల ద్వారా తామే యజమానులమని నమ్మించి వేరే వారికి లీజుకు ఇస్తున్నారు. బండ్లగూడకు చెందిన నుస్రత్ బేగం అనే మహిళ వద్ద రూ.3 లక్షలు వసూలు చేసి మోసగించిన ఈ ముఠాలో షేక్ ఒమర్ అమూదిని అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు యజమాని అద్దె కోసం రావడంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.