Ashok Gajapathi raju on Rushikonda Palace: ఏపీలో రుషికొండ ప్యాలెస్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనతో రుషికొండ ప్యాలెస్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. అయితే తాజాగా గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు రుషికొండ ప్యాలెస్ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. రుషికొండ ప్యాలెస్ను మానసిక వైద్యశాల (మెంటల్ హాస్పిటల్) చేయాలని సూచించారు. ప్రజల డబ్బులతో కట్టినదానిని ప్రజాహితం ఉపయోగించాలన్నారు.