AP High Court Serious On Political Parties: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాజకీయ పార్టీల తీరుపై సీరియస్ అయింది. చిన్న విషయాలకు కూడా కోర్టును ఆశ్రయించడాన్ని తప్పుబట్టింది. తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నికలో భద్రత కల్పించాలని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు వేసిన పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది. ఎన్నికల సంఘం ఆదేశించినా పోలీసులు పట్టించుకోలేదా అని ప్రశ్నించింది. పోలీసులు తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. రాజకీయ పార్టీలు కోర్టును క్రీడామైదానంలా వాడుకుంటున్నాయని వ్యాఖ్యానించింది.