హైదరాబాద్ డా. బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రూ.100 కోట్లతో 'బ్రిడ్జ్' అనే అంతర్జాతీయ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. రెండు ఎకరాల్లో నిర్మించే దీనికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చుతుంది. వచ్చే ఆరు నెలల్లో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ కేంద్రం సామాజిక అసమానతలు, ప్రభుత్వ పథకాల అమలు, రాజ్యాంగ విధివిధానాలు, సామాజిక న్యాయంపై అధ్యయనం చేస్తుంది.