వినాయక చవితి సందడిలో గణేశుడి లడ్డూ వేలం ఒక ప్రత్యేక ఆకర్షణ. ఈసారి హైదరాబాద్లో ఒక లడ్డూ ఏకంగా రూ. 2.32 కోట్లు పలికి రికార్డు సృష్టించింది. గత రికార్డులన్నీ బద్దలుకొడుతూ.. రాజేంద్రనగర్ రిచ్మండ్ విల్లాలో హయ్యెస్ట్ ధర పలికింది. ఇక బాలాపూర్ లడ్డూ వేలం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.