రూ. 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలన్నింటినీ మొదటి పంటకాలంలోనే తమ ప్రభుత్వ మాఫీ చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 25,35,964 మంది రైతులకు రూ.20,616.89 కోట్ల రుణాలను మాఫీ చేసిందన్నారు. రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు అర్ధరహితమన్నారు.