రూ.5 బిస్కెట్ ప్యాకెట్‌ వేసినందుకు 130 కి.మీ వెంట నడిచిన శునకం.. కొండగట్టు యాత్రలో అద్భుతం..!

3 months ago 17
ఆదిలాబాద్ జిల్లా నుంచి కొండగట్టు వరకు హనుమాన్ భక్తుల పాదయాత్రలో ఒక శునకం చూపిన విశ్వాసం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం రూ.5 బిస్కెట్ ప్యాకెట్ వేసినందుకు కృతజ్ఞతగా ఆ మూగజీవి 130 కిలోమీటర్ల మేర భక్తుల వెంట నడిచింది. నడక కొనసాగిస్తూనే ఉంది. కాళ్లకు పొక్కులు వచ్చినా లెక్కచేయకుండా.. అటవీ ప్రాంతంలో వారికి రక్షణగా ఉంటూ భక్తిని, విశ్వాసాన్ని చాటిచెప్పింది. భక్తులు కూడా దానికి సాక్సులు తొడిగి, ఎంతో ప్రేమగా సపర్యలు చేస్తూ తమతో పాటు క్షేత్రానికి బయల్దేరారు.
Read Entire Article