హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో 'బ్లౌజ్ వరల్డ్' ప్రారంభోత్సవం సందర్భంగా రూ.500లకే ఐదు బ్లౌజ్ల ఆఫర్తో మహిళలు భారీగా తరలివచ్చారు. ఈ ఆఫర్ కారణంగా షాపు ముందు కిలోమీటరు మేర క్యూ లైన్ ఏర్పడటంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన రావడంతో యజమాని ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.