ఈ వేసవి కాలంలో మీరు గోవా వెళ్లాలని అనుకుంటున్నారా. అయితే ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజీ తీసుకువచ్చింది. కేవలం గోవా మాత్రమే కాకుండా పలు ఆధ్యాత్మిక కేంద్రాలను కూడా ఈ టూర్లో సందర్శించే అవకాశం కల్పించారు. హైదరాబాద్ నుంచి బయల్దేరనున్న రాజధాని ఏసీ బస్సు.. గోవాకు వెళ్లి తిరిగి రానుంది. ఇక ఇందులో ప్రయాణించేందుకు టికెట్ ధరను ఒక్కొక్కరికీ రూ.5130గా ఆర్టీసీ నిర్ణయించింది.