Visakhapatnam KGH Rs 40 Crore Machines To Treat Cancer: ఉత్తరాంధ్ర ప్రజలకు శుభవార్త.. విశాఖపట్నంలో ఉన్న కింగ్ జార్జ్ ఆస్పత్రిలో.. రూ. 40 కోట్ల రూపాయల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇకపై క్యాన్సర్ రోగులకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వేలు, లక్షలు ఖర్చు చేసే అవసరం లేకుండా కేజీహెచ్లోనే ఉచితంగా రేడియో థెరపీ సేవలు లభిస్తాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్ నుండి వచ్చే రోగులకు కూడా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. అన్ని రకాల క్యాన్సర్లకు అత్యాధునిక చికిత్సలు అందిస్తామని వైద్యులు తెలిపారు.