మున్నేరు వాగు వరద నీటిని పాలేరు రిజర్వాయర్కు మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.162.54 కోట్లు విడుదల చేసింది. దీని ద్వారా 10 TMC నీటిని మళ్లించి, 2.54 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించవచ్చు. పాలేరు నియోజకవర్గంలోనే 1.30 లక్షల ఎకరాలకు లబ్ధి చేకూరుతుంది. దీని వల్ల సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు తాగునీరు, డోర్నకల్ ప్రాంతానికి సాగునీరు అందుతుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.