తెలంగాణలో రెండు మున్సిపాలిటీలు, ఒక గ్రామ పంచాయతీ ఏర్పాటుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఈ నిర్ణయంతో సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీలుగా మారనున్నాయి. అలానే నల్గొండ జిల్లా హాలియా పరిధిలో ఇబ్రహీంపేట కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదిలా ఉంటే బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుపై ఇంకా సందిగ్ధత నెలకొనే ఉంది. మరి దీనిపై గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో చూడాలి.