తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో ఆర్థిక ఇబ్బందులు, సరఫరా సమస్యలు, నిర్మాణ వ్యయం పెరుగుదల వంటి అనేక సవాళ్లను లబ్ధిదారులు ఎదుర్కొంటున్నారు. పునాది రుణాలు, ఉచిత ఇసుక సరఫరాపై స్పష్టత లేకపోవడం.. నమూనా ఇళ్లపై అవగాహన లేకపోవడం వంటి సమస్యలను పరిష్కరించాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంతే కాకుండా.. ఆర్థికంగా తోడ్పాటును అందించే ఐకేపీలపై లబ్ధిదారులకు అవగాహన లేకపోవడం కూడా ఒక సమస్యగా మారింది. ఇదిలా ఉండగా.. ఈ వారంలో రెండో విడత లబ్ధిదారుల జాబితా విడుదల కానున్నట్లు తెలుస్తోంది.