మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మామిడి రైతులను పరామర్శించడానికి బంగారుపాళ్యం వెళ్లనున్నారు. చిత్తూరు జిల్లాలో పర్యటనకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే సభలు, రోడ్ షోలకు అనుమతి లేదు. భారీగా జనసమీకరణ చేస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ప్రభుత్వం మామిడి రైతులకు కనీస మద్దతు ధర కల్పించడంలో విఫలమైందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. అయితే జగన్ పర్యటనపై టీడీపీ కూడా కౌంటర్ అటాక్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది.