తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు వెళ్లనున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనడం కోసం సీఎం రేవంత్ విజయవాడ వెళ్తున్నారు. ఉదయం బేగంపేట విమానాశ్రయం నుండి బయలుదేరి కానూరులోని కళాశాల ప్రాంగణానికి చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ నుంచి వివాహ వేడుక వద్దకు వెళ్లి.. వధూవరులను ఆశీర్వదించి, మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ వివాహానికి హాజరు కానున్నారు.