కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డిని ఎవరూ గుర్తు పట్టడం లేదంటూ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే.. సీఎం రేవంత్ రెడ్డి నేషనల్ లెవల్లో లెజెండ్ అవుతారంటూ జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా కవిత, కేటీఆర్లపైనా మందుల సామేల్ తీవ్ర విమర్శలు గుప్పించారు.