మేడిగడ్డ బ్యారేజీపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతి పెద్ద మోసమని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేస్తున్నారని, తమ హయాంలో అన్నీ బాగానే ఉన్నాయని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, సంపద ఎక్కడికి పోతోందని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి హామీలపై మాట తప్పుతున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు.