ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా... కరీంనగర్లో కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల బీజేపీ మండల అధ్యక్షులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన బండి సంజయ్.. కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పుకొచ్చారు. ఐఏఎస్లను తప్పు చేయాలని ముఖ్యమంత్రే అంటారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర కేబినెట్ మంత్రుల్లో, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చిందని బండి సంజయ్ ఆరోపించారు.