తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సత్యకుమార్ భగ్గుమన్నారు. పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకు వివాదాస్పద వ్యా్ఖ్యలు చేయడం రేవంత్ రెడ్డికి అలవాటేనంటూ మండిపడ్డారు. తుమ్మితే పోయే పదవి కోసమే ఆయన తాపత్రయమని.. బీజేపీని అడ్డుకోవటం ఇందిర, నెహ్రూ వల్లే కాలేదు రేవంత్ వల్ల ఏమవుతుందంటూ ట్వీట్ చేశారు.