పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఉదయం అల్పాహారంతో పాటు పాలు కూడా అందించనున్నారు. 100 రోజుల న్యూట్రిషన్ మిషన్ ప్రచారాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. పిల్లల ఎదుగుదల సరిగా లేదని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వయం సహాయక బృందాలను భాగస్వామ్యం చేసి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు మీకోసం..