తెలంగాణలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నట్లు వచ్చిన వార్తలను బీవైడీ సంస్థ ఖండించింది. హైదరాబాద్లో ప్లాంట్ ఏర్పాటుపై ప్రస్తుతం ఎటువంటి ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం బీవైడీతో చర్చలు జరుపుతోంది. తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తి చూసే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.