అంగన్వాడీ వర్కర్లకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. అంగన్వాడీల్లో ఆయాలు టీచర్లుగా ప్రమోట్ అయ్యేందుకు ఇంటర్ విద్య తప్పనిసరి అన్న నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. పదో తరగతి అర్హతతో టీచర్లుగా ప్రమోట్ అయ్యేందుకు ఛాన్స్ కల్పించింది. ఈ ఉత్తర్వులపై ఆయాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.