Breakfast to Anganwadi Children: నూతన సంవత్సర కానుకగా తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ విద్యార్థులకు శుభవార్త అందించింది. జనవరి మొదటి వారం నుంచే అంగన్వాడీల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించనుంది. ముందుగా హైదరాబాద్లో పైలట్ ప్రాజెక్ట్గా మొదలై, విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు. టీజీ ఫుడ్స్ ద్వారా కిచిడీ, ఉప్మా వంటి రెడీ-టు-ఈట్ ఆహారాన్ని అందిస్తారు. ఈ పథకం ద్వారా 8 లక్షల మంది చిన్నారుల ఆకలి తీర్చి, వారి ఆరోగ్యాన్ని మెరుగుపర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.