తెలంగాణలో తనదైన మార్క్ పాలనతో దూసుకుపోతున్న సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలకు ఉపయోగపడేలా ఒకే డిజిటల్ కార్డును తీసుకు రావాలని ఆలోచన చేస్తున్నారు. వన్ స్టేట్ వన్ కార్డు తరహాలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డును అందజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు.. సోమవారం (సెప్టెంబర్ 23న) రోజున సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.