తెలంగాణలో రేషన్ కార్డుదారులకు రేవంత్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. సన్నబియ్యం పంపిణీకి ముహుర్తం ఫిక్స్ చేసింది. ఈ ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి తెలంగాణలోని అన్ని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం ఇవ్వనున్నారు.