తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుండి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు మూడు నెలల (జూన్, జూలై, ఆగస్టు) ముందస్తు రేషన్ పంపిణీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ ఈ ఏర్పాట్లు చేసింది. పంపిణీలో పారదర్శకతకు ఈ-పాస్, బయోమెట్రిక్ విధానాలు అమలు చేయనున్నారు.