తెలంగాణలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు రేవంత్ సర్కార్ శుభవార్త అందించింది. ప్రస్తుతం సన్నబియ్యం అందిస్తుండగా.. త్వరలో నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రేషన్ బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు కూడా అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని చెప్పారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ నిర్ణయం నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో సహాయపడుతుందని అన్నారు.