తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏప్రిల్ 1, 2025 నుండి రేషన్ కార్డుదారులకు ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది, ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల బియ్యం అందిస్తోంది. అయితే, కొందరు లబ్ధిదారులు బియ్యం అమ్ముకుంటున్నారని గుర్తించిన అధికారులు, అలా చేస్తే రేషన్ కార్డు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి, అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నారు.