తెలంగాణలోని రేషన్ కార్డు దారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తారని ప్రజలు ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. పాత రేషన్ కార్డు దారులకు మాత్రం తీపి కబురు వినిపించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సన్నబియ్యంతో పాటు గోధుమలు కూడా ఇవ్వనున్నట్టు తెలిపారు. అయితే.. ఈ సన్నబియ్యం ఎప్పటి నుంచి ఇస్తారంటే..?