తెలంగాణలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం పంపిణీలో అక్రమాలు వెలుగు చూశాయి. మంచిర్యాల జిల్లాలో ఉచితంగా పొందిన బియ్యాన్ని అమ్ముకుంటున్న 11 మంది రేషన్ కార్డులను అధికారులు రద్దు చేశారు. రేషన్ బియ్యం అక్రమంగా అమ్మినా, కొన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం బియ్యం కోటాను పెంచింది.