ఏపీలోని రేషన్ కార్డుదారులకు బ్యాడ్ న్యూస్.. ఈ నెలలోనూ రేషన్ దుకాణాల్లో కందిపప్పు అందించడం లేదు. గత కొన్ని నెలలుగా రేషన్ షాపుల్లో కందిపప్పు సరఫరా నిలిచిపోయింది. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర చుక్కలను అంటుతూ ఉండటంతో రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం అందిస్తుందని ప్రజలు ఆశించారు. అయితే సెప్టెంబర్ నెలలోనూ కందిపప్పు సరఫరా చేయకపోవటంతో లబ్ధిదారులు ఉసూరు మంటున్నారు.