తెలంగాణలో అనుమానాస్పద రేషన్ కార్డులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆరు నెలలుగా బియ్యం తీసుకోని 96 వేల కార్డులను గుర్తించారు. విచారణలో ఆరు వేలకు పైగా కార్డులు అనర్హమైనవిగా తేలాయి. సూర్యాపేట జిల్లాలో విచారణ పూర్తి కాగా.. 12 జిల్లాల్లో ఇంకా ప్రారంభం కాలేదు. అనర్హుల కార్డులను రద్దు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. క్షేత్రస్థాయి పరిశీలనలో భారీగా అనర్హులు ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.