మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని రేషన్ కార్డు లబ్ధిదారులు తప్పనిసరిగా సెప్టెంబర్ లోపు ఈ-కేవైసీ నమోదు చేయించుకోవాలని జిల్లా పౌర సరఫరా అధికారి తెలిపారు. ఇప్పటి వరకు 13 లక్షల మందే నమోదు చేసుకోగా.. మిగిలినవారు బయోమెట్రిక్ ద్వారా సమీప రేషన్ దుకాణంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఇక ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు మినహాయింపు ఉంటుందన్నారు. నమోదు చేయని వారికి రేషన్ సదుపాయం నిలిచే అవకాశం ఉన్నందున.. వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా కోరారు.