తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు శుభవార్త. రేషన్ షాపుల్లో మూడు నెలల రేషన్ పంపిణీ గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు.. లబ్ధిదారుల సౌలభ్యం కోసం మూడు నెలల రేషన్ను ఒకేసారి తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. కొత్తగా కార్డులు పొందినవారు, అలాగే ఇప్పటికే రేషన్కార్డులు కలిగినవారు కూడా ఈ వెసులుబాటును వినియోగించుకోవచ్చు. అన్ని రేషన్ షాపులు జూన్ 30 వరకు పనిచేస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు.