పేదల కోసం ప్రభుత్వాలు పంపిణీ చేసే ఈ ఉచిత బియ్యం బ్లాక్మార్కెట్కు తరలిపోతోంది. గత కొద్దికాలంగా సార్టెక్స్ మెషీన్లు వచ్చిన తర్వాత నూక, మట్టి, చిన్నచిన్న రాళ్లను తొలగించి పోర్టిఫైడ్ బియ్యం కలిపి ఇస్తున్నారు. దీంతో పేదలు, చిన్న సన్నకారు రైతులు, రైతు కూలీలు, కార్మికులు ఇదే బియ్యాన్ని వాడుతున్నారు. అయితే, కేవలం ప్రభుత్వ పథకాల కోసమే తెల్లరేషన్ కార్డులు పొందుతున్న వారు మాత్రం ఆ బియ్యాన్ని దళారులకు అమ్మేస్తున్నారు.