CM Chandrababu Launches Rytanna mee Kosam: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'రైతన్నా.. మీ కోసం' కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సోమవారం (నవంబర్ 24) ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు లేఖ రాశారు. దీన్ని కరపత్రం రూపంలో రైతులకు అందించనున్నారు. అందులో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, ఆధునిక పద్ధతులు అవలంభించేందుకు, ప్రకృతి వ్యవసాయం, టెక్నాలజీ వినియోగం, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్టుబడి సాయం వంటి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. ఈ విషయాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులకు అవగాహన కల్పించనున్నారు.