తెలంగాణలో ఖరీఫ్ రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి. అయితే.. రబీ సీజన్ సమయంలో నాలుగు ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులకు ఇప్పటికీ డబ్బులు అందలేదు. రాష్ట్ర మంత్రులు గతంలో ఆర్థిక సమస్యల కారణంగా ఆలస్యం అని హామీ ఇచ్చినా.. బకాయిలు చేరలేదు. ఇప్పుడు ఖరీఫ్ నిధులు జమ అవుతుండగా, రబీ డబ్బుల పై స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. రెండు సీజన్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్ రైతులు డిమాండ్ చేస్తున్నారు.