తెలంగాణ ప్రభుత్వం 'రైతు భరోసా' పంట పెట్టుబడి సాయం నిధులను సోమవారం విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిరోజు 2 ఎకరాల వరకు ఉన్న 41.25 లక్షల మంది రైతులకు ఎకరానికి రూ. 6 వేల చొప్పున మొత్తం రూ. 2,349.83 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు. నిధులు జమ కాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాబోయే 9 రోజుల్లో మిగిలిన అర్హులైన రైతులందరికీ నిధులు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.