తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని వేగంగా అమలు చేస్తోంది. ఈ నెల 16న ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటికే 65.12 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. ఈరోజుతో 90శాతం పంపిణీ పూర్తి కానుండగా, సోమవారానికి 100 శాతం పూర్తవుతుందని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు రూ.7,310.59 కోట్లు విడుదల చేశారు. తాజాగా 10 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకూ నిధులు జమ చేశారు.