పంట పెట్టుబడి సాయం రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్న రైతులకు తీపి కబురు. రేపట్నుంచి ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి. ఈ మేరకు అర్హులైన రైతుల జాబితాను వ్యవసాయశాఖ అధికారులు ఆర్థికశాఖకు పంపించారు. జూన్ 16 నుంచి విడతల వారీగా రైతుల ఖాతాల్లోకి పంట పెట్టుబడి సాయం నిధులు జమ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.