తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పంట పెట్టుబడి సాయం నిధులు విడుదల చేసింది. బుధవారం ఎకరం లోపు సాగులో ఉన్న భూములకు డబ్బులు జమ చేశారు. మెుత్తం 17.03 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో ఎకరాకు రూ.6 వేల చొప్పున జమ చేశారు. మిగిలిన రైతులకు త్వరలనోనే జమ చేస్తామని ఎవరూ టెన్షన్ పడాల్సిన పని లేదని మంత్రి తుమ్మల వెల్లడించారు.