Tummala on Rythu Bharosa Funds: తెలంగాణ రైతులు రైతు భరోసా నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఇంకా నిధులు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు త్వరలోనే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఎరువుల కొరత లేకుండా చూస్తామని, మద్దతు ధర కల్పిస్తామని తెలిపారు. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి తీసుకువస్తామని మంత్రి పేర్కొన్నారు.