తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. ఖరీఫ్ సీజన్ రైతు భరోసా నిధులను విడుదల చేసింది. కొత్తగా భూమి హక్కులు పొందిన రైతులు కూడా ఈ పథకానికి అర్హులేనని తెలిపింది. జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అర్హులైన రైతులు అవసరమైన పత్రాలతో ఏఈవోను సంప్రదించి నమోదు చేసుకోవాలని సూచించింది. ఇప్పటివరకు 51.70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,902 కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.