తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. ఖరీఫ్ సీజన్ కోసం రైతు భరోసా నిధులను విడుదల చేస్తోంది. ఎకరాకు రూ.6 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇప్పటికే 10 ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. కొత్తగా 1.40 లక్షల మంది రైతులు రైతు భరోసా పథకంలో చేరారు. వీరికి కూడా త్వరలోనే నిధులు జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.