తెలంగాణలో రైతులకు సౌర విద్యుత్ ప్లాంట్లపై కేంద్రం షాక్ ఇచ్చింది. పీఎం కుసుమ్ పథకం కింద కొత్త ఒప్పందాలు ఈ నెలాఖరుతో ఆగిపోనున్నాయి. రూ.3.13 ధరతో కొనుగోలు చేయడం డిస్కంలకు భారంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త ఏడాది నుంచి కొత్త ఒప్పందాలకు నో ఛాన్స్. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 3 వేల మెగావాట్ల కొనుగోలుకు సిద్ధమవుతోంది.