Sathya Sai District Farmer Idea: శ్రీసత్యసాయి జిల్లా రైతులు తమ వేరుశనగ పంటను కాపాడుకోవడానికి ఒక వినూత్న పద్ధతిని అవలంబిస్తున్నారు. జింకలు, అడవి పందుల నుండి పంటను రక్షించడానికి రైతులు చీరలను పొలం చుట్టూ కట్టి, రక్షణ కల్పిస్తున్నారు. రంగురంగుల చీరలు చూసి మనుషులు ఉన్నారని భ్రమించి జంతువులు పారిపోతాయని రైతులు నమ్ముతున్నారు. అంతేకాదు, కొందరు రైతులు మైకుల్లో పెద్దగా అరుపులు రికార్డ్ చేసి వినిపిస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి.